#History

ఘనచరిత్ర మన రాయలసీమ -1

ఘనచరిత్ర మన రాయలసీమ.

 

రాయలసీమ ప్రాంతం ఆదినుంచి అనాదకాదు. 1800 సంవత్సరం ముందు, తర్వాత నైజాం ఆదీనంలోకి వెల్లిన తర్వాతనే నాటి నిజాం,ఆంగ్లేయుల పాలన, పాలేగాళ్ల వ్యవస్ద తోనే రాయలసీమ కరువు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర రాజుల కాలంలో రతనాలసీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అబిమతంతో సంబందం లేకుండా ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు రాయలసీమ అని నామకరణం జరిగిన రోజు 1928 నవంబర్ 18. అలా సీమ రాయలసీమగా ఆత్మగౌరవంతో నిలబడింది.

 

చరిత్రలోకి వెలితే……..

1800 కి పూర్వం రాయలసీమ ప్రాంతం రతనాలసీమ. రాక్షసి తంగడి యుద్దంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడం వరుస దాడులు కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠ వారితో యుద్ద బయంతో ఉన్న నిజాము ఆంగ్లేయులతో సైనిక సహరం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహరం ఇవ్వలేని నిజాము సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలివేసినారు. ఆ మొత్తం వ్యవహరంలో సీమ ప్రజల మనోబావాలను లెక్కలోకి తీసుకోలేదు. పలితంగా పాలేగాళ్లు ఏలుబడిలో ఉన్న సీమ ప్రాంతంలో ప్రారంబంలో ఆంగ్లేయులకు పాలేగాళ్ల నుంచి ప్రతిఘటన వచ్చింది. బలమైన సైనిక సామర్ద్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన సీమపాలేగాళ్లు నిలువలేకపోయినారు. అలా ఆంగ్లేయుల ఆదిపత్యాన్ని వ్యతిరేకించిన సీమ పాలేగాళ్లు తొలి స్వతంత్యోద్యమాన్ని నిర్వహించి చరిత్రలో నిలిచినారు. కాని ఈ నాటికి చరిత్రలో ఆ స్దానం మనకు లబించలేదు. ఆంగ్లేయులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీ డె డ్ జిల్లాలుగా పివబడింది. దీన్నే తెలుగు అర్దంలో దత్తమండలం అని పిలిచినా నిజానికి సీ డె డ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్దం సరికాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అన్న దానికన్నా ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్దే సీమ ప్రజల మన్నలనను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు. అలా సీమ ప్రాంతం దత్తమండలాలుగా, సీ డె డ్ ప్రాంతంగా పిలవబడింది.

 

నంద్యాల సభలో కీలక నిర్ణయం…….

1913 లో ప్రారంబమైన ఆంద్రమహసభలు 1928న 17,18 తేదీలలో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు కచ్చితంగా దత్తమండలం సమస్యలపై సమావేశానికి అవకాశం ఇస్దేనే తాము సహకరిస్దామన్న ఈ ప్రాంతనేతల వత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అద్యక్షతన ప్రదమ దత్తమండలం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు ( అనంతపురం కాలేజి అద్యాపకులు శ్రీకాకులం వాసి) గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదని రేనాడు రాజులు , విజయనగర రాజులు పాలించి గొప్ప చారిత్రక నేపథ్యం , సహజ వనరులను కలిగి ఈ ప్రాంతానికి రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందని ప్రతిపాదించినారు. ఈ ప్రతిపాదనను పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా రాయలసీమ అన్న ప్రతిపాదనను ఆమోదించడంతో నాటి నుంచి రాయలసీమగా మారింది.

 

ఘన చరిత్రకు దక్కని అధికారిక గుర్తింపు

రాయలసీమకు గొప్ప చరిత్ర ఉంది విజయనగర సామ్రాజ్యంలో అబివృద్ది చెందిన ప్రాంతంగా, అన్నమయ్య, వేమన లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన ప్రాంతం సీమ. అన్నమయ్యను టిటిడి మాత్రమే పట్టించుకుంటుంది. పప్పూరి తెలుగు ప్రజలు గర్వించదగ్గ దేశబక్తుడు వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే సముచితంగా ఉంటుంది. తొలి స్వతంత్రసమరయోదిడిగా ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి అని తెలుస్తున్నా ఆ వైపుగా ప్రభుత్వం ప్రయత్నం కేంద్రం దగ్గర అధికారిక గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేయాలి. చివరకు గత ప్రభుత్వం దైవ కార్యక్రమము అయిన క్రిష్ణాపుష్కరాలను నది ప్రారంబమైన శ్రీశైలం దగ్గర కాకుండా సముద్రలో కలిసే దగ్గర నిర్వహించింది. అదే వైయస్ రాజశేఖర రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ ముఖ ద్వారం ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పుష్కరాలు నిర్వహించారు. శ్రీశైలంలో నిర్వహిస్దే ప్రజలు పాల్గొని మన రాయలసీమలో పుష్కలంగా నీరు ప్రవహిస్తుందన్న చైతన్యం ప్రజలలో వస్తుంది. రాయలసీమ ఘనచరిత్రను గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెలుగులోకి రాలేక నష్టపోతుంది.

 

అనుబావాలనుంచి గునపాఠం నేర్చుకోకపోతే మళ్ళీ రాయలసీమ నష్ట పోతుంది.

1928లో రాయలసీమ అని నామకరణం జరిగిన సమయంలోనే ఆంద్రప్రాంతంతో కలిపి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలన్న చర్చలు నడుస్తున్న రోజులలో ఆంద్ర విశ్వవిద్యాలయం అనంతలో స్దాపించాలని1926 లో జరిగిన ఆంద్రమహసభ తీర్మాణాన్ని, మద్రసు శాశనసబ తీర్మానాన్ని సైతం ఉల్లంగించి అనంతలో ఉండాల్సిన ఆంద్రవిశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడ అటు పిమ్మట వైజాగ్ తరలించారు. ఆ సంస్దకు తెలివిగా సీమకు చెందిన కట్టమంచిని వైస్ చాన్స్ లర్ గా నియమించి వారితోనే వై జాగ్ లో ఉండటం మంచిదని చెప్పించినారు. గత అనుభవాన్ని మరిచి అమాయక సీమ పెద్దలు శ్రీభాగ్ ఒప్పందం అవగాహణతో వారితో కలిపి ఆంద్రరాష్ట్రాంగా ఉండటానికి ఇష్టపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాలకే పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదికన తెలంగాణతో కలిపి ఆంద్రప్రదేశ్ గా మారినపుడు కర్నూలు రాజధానిని వదులుకుని కనీసం పెద్దమనుషుల ఒప్పందంలో శ్రీభాగ్ ఒప్పందాన్ని ప్రస్దావించనూ లేదు. కాని ముఖ్యమంత్రిగా మాత్రం రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డిని నియమించినారు.
అలా పదవులు సీమకు పనులు మాత్రమే దక్కాయి. కీలక సమయం వచ్చినపుడు తప్పుడడుగుల కారణంగా తీవ్రంగా నష్టపోయినది రాయలసీమ. 2014 లో రాజధాని ఎంపికలో సీమకు రాజధాని రావాల్సి ఉంది కనీసం హైకోర్టు కూడా రాలేదు.

వికేంద్రీకరణలో రాయలసీమకు న్యాయం జరగాలి.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ విధానంలో భాగంగా రాజధానిలోని మూడు కీలక వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుతో బాటు న్యాయ స్వభావం ఉన్న కార్యాలయాలు కర్నూలులో నెల కొల్పడానికి ముందుకు వచ్చింది. ఈ వెసులుబాటు కూడా రాయలసీమకు రావాడాన్ని వ్యతిరేకించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. KRMB ని కర్నూలులో ఏర్పాటు చేయడం , రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే రోజూ వారి సమీక్షతో సంబంధం లేని పలు కమిషనరేట్ లు రాయలసీమ లో ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా శ్రీభాగ్ ఒప్పందంలో కీలకమైన అంశం కృష్ణా , తుంగభద్ర నీటిని రాయలసీమ అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అది జరగాలంటే సిద్దేశ్వరం , గుండ్రేవుల , పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్ధ్యం పెంపు , చెరువుల పునరుద్ధరణ పనులు జరగాలి. ముఖ్యంగా కృష్ణా నీటిలో ఏపీ వాటానుంచి తమకు అధికంగా కేటాయింపులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో రాయలసీమ ప్రాజెక్టులు గాలేరు నగరి , హంద్రీనీవా , వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి రాష్టానికి నీటి అవసరాల ప్రాధాన్యతను కోర్టులు ముందు ఉంచాలి. లేక పోతే రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాల కేటాయింపు ప్రశ్నగా మిగిలిపోతుంది. అటువైపు చర్చ జరిగితే రాయలసీమకు ప్రయోజనం కలుగుతుంది.

అందుకే 94 సంవత్సరాల క్రితం అవమానకరంగా పిలిచుకున్న దత్తమండలం నుంచి ఆత్మగౌరవంతో కూడిన రాయలసీమగా మారిన మన సీమ గత పాలకుల వివక్షపూరిత పాలన సీమలో పుడుతున్న 100 మంది పిల్లలలో 45 మంది బలహీనంగా పుడుతున్నారన్న ఐక్యరాజ్యసమితి గణాంకాలు ఆందోళన కలుగుతుంది. ఆత్మగైరవ నినాదంతో ప్రారంబమైన రాయలసీమ ప్రజల ప్రస్దానం చైతన్యంతో వివక్ష అంతం అయ్యేదాక ఆత్మాబిమానంతో మన జీవితాలు ఉండేరోజు కోసం పోరాడుతూనే ఉండాలి………

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం
9490493436.

389
16

Leave a comment

Your email address will not be published. Required fields are marked *